
భూ సమస్యలు పరిష్కరిస్తాం
కమాన్పూర్(మంథని): భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంథని ఆర్డీవో సురేశ్ అన్నారు. నాగారంలో మంగళవారం నిర్వహించిన భూ భారతి రె వెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేస్తే అధికారు లు పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. తహసీల్దార్ వాసంత, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, ఆర్ఐ వాసంత, సిబ్బంది సతీశ్, రాజేందర్, రజిత, కట్ట కుమార్ పాల్గొన్నారు. కాగా, గుండారంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో శాస్త్రవేత్త సిద్ధి, ఏవో గిరిరామకృష్ణ, ఏఈవోలు అనూష, శ్వేత పాల్గొన్నారు.
విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలి
ఎలిగేడు(పెద్దపల్లి): రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రావణి అన్నారు. స్థానిక రైతువేదికలో మంగళవారం నిర్వహించిన కా ర్యక్రమంలో ఆమె మాట్లాడారు. నాణ్యమైన వి త్తనాన్ని వినియోగిస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు. ఏడీఏ కాంతారావు, మండల వ్యవసాయశాఖ అధికారి ఉమాపతి, ఏఈవోలు సురేశ్, గణేశ్, శరణ్య, రైతులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలు వాడాలి
పెద్దపల్లిరూరల్: నాణ్యమైన విత్తనాలతోనే అధి క దిగుబడి వస్తుందని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త శ్రీధర్ సిద్ధి అన్నారు. రాఘవాపూర్ రైతువేదికలో మంగళవారం పలువురు రైతులకు 46 వరి విత్తన, 23 పెసరు విత్తన బ్యాగులు పంపిణీ చేశారు. ఏవో అలివేణి, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గట్టెపల్లి ప్రభుత్వ ఉ న్నత పాఠశాల విద్యార్థిని రమాదేవి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటింది. అథ్లెటిక్స్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన షాట్పుట్ అండర్– 12లో సిల్వర్ మెడల్ సాధించింది. ఎంఈవో రాజయ్య హెచ్ఎం అన్నపూర్ణ, పీడీ ప్రణయ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గట్టయ్య తదితరులు అభినంధించారు.
యూటీఎఫ్ బడిబాట ప్రారంభం
పెద్దపల్లిరూరల్: టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని డీఈవో మాధవి, జీసీడీవో కవిత మంగళవారం జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పాఠశాల విద్యలో డిజిటల్ విద్యోపకరణాలతో బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తల్లిదండ్రులు కార్పొరేట్ ఉచ్చులో పడి పిల్లలకు మానసిక ఒత్తిడితో కూడిన విద్య అందించొద్దని, వారి భవిష్యత్ను ఆలోచించి నాణ్యమైన విద్య అందించే ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని కోరారు. ప్రతినిధులు కాంపెల్లి లక్ష్మణ్, విష్ణు, ప్రణయ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ల పునర్విభజన ముసాయిదా విడుదల
కోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను 60 డివిజన్లుగా విభజిస్తూ రూపొందించిన ముసాయిదాను అధికారులు మంగళవారం విడుదల చేశారు. నగరంలోని పాత 50 డివిజన్లు, విలీమైన నాలుగు గ్రామాల్లోని ఓటర్లను లెక్కించి తుది జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితా ప్రకారం 60 డివిజన్లలో మొత్తం 1,84,417 మంది ఓటర్లు ఉన్న ట్లు అధికారులు ఆ జాబితాలో పేర్కొన్నారు. 50 డివిజన్లలో 1,74,172 మంది ఓటర్లు ఉండ గా, తాజా ముసాయిదాలో 1,84,417 మంది ఓటర్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో 10,245 మంది కొత్త ఓటర్లు వచ్చిచేరారు. వైశాల్యం ఆధారంగా ఒక్కో డివిజన్లో సుమారు 2,600 మంది నుంచి 3,650 మంది ఓటర్లను కేటాయిస్తూ 60 డివిజన్ల ఓటర్ల సంఖ్యను ముసాయిదాలో సర్దుబాటు చేశారు. కాగా, ఈనెల 11వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని కమిషనర్ అరుణశ్రీ సూచించారు.

భూ సమస్యలు పరిష్కరిస్తాం

భూ సమస్యలు పరిష్కరిస్తాం

భూ సమస్యలు పరిష్కరిస్తాం