ధాన్యం కొనుగోళ్లలో పెద్దపల్లిదే అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో పెద్దపల్లిదే అగ్రస్థానం

Jun 4 2025 12:33 AM | Updated on Jun 4 2025 12:33 AM

ధాన్యం కొనుగోళ్లలో పెద్దపల్లిదే అగ్రస్థానం

ధాన్యం కొనుగోళ్లలో పెద్దపల్లిదే అగ్రస్థానం

సాక్షి, పెద్దపల్లి: ధాన్యం కొనుగోళ్లు, రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బు జమచేయడంలో జి ల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. స్థానిక ఆర్‌కే గార్డెన్స్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 315 కొనుగోలు కేంద్రాల ద్వారా 60,020మంది రైతుల నుంచి 3,98,006 మెట్రిక్‌ టన్నుల ధా న్యం కొనుగోలు చేశామన్నారు. రికార్డు స్థాయిలో 58 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 871.02 కోట్ల ధాన్యం డబ్బు జమచేశామని అ న్నారు. 95శాతం చెల్లింపులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. అకాల వర్షాల తో తడిసిన, రంగు మారిన మెలకెత్తిన ధాన్యాన్ని కోతల్లేకుండా కొనుగోలు చేయించామని చెప్పా రు. సన్నవడ్ల బోనస్‌ రూ.38.54 కోట్లను త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో యాసంగిలో 24 శాతం చె ల్లింపులు చేస్తే.. ప్రజాపాలనలో ఈ సీజన్‌లో 95 శాతం మందికి జమచేసి పెద్దపల్లిని ఆదర్శంగా నిలిపామన్నారు. రైతులను మోసం చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌, నల్లచట్టాలు తెచ్చి అన్నదాతలపై బు ల్లెట్లు ప్రయోగించిన పార్టీ బీజేపీ అని, రైతులను రాజును చేయాలనుకునే పార్టీ కాంగ్రెస్‌ అని ఆ యన అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి సన్నధాన్యన్ని బాయిల్డ్‌ చేయాలని ఒప్పించామని గుర్తుచేశారు. ఏఎంసీ చైర్‌పర్సన్లు ఈర్ల స్వరూప, మినుకాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్లు ఆళ్ల సుమన్‌రెడ్డి, చింతపండు సంపత్‌, రాంచంద్రారెడ్డి, కుర్రమల్లరెడ్డి, నూగిల్లా మ ల్లన్న, భూతగడ్డ సంపత్‌, సయ్యద్‌ మస్రుత్‌, మూ ల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ధనాయక్‌ దామోదర్‌రావు, అరె సంతోష్‌, సమా రాజేశ్వర్‌రెడ్డి, చిలుక సతీశ్‌, బొజ్జ శ్రీనివాస్‌, బొంకురి అవినాశ్‌, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, జడల సురేందర్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement