నేటి యువత పోరుకు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

నేటి యువత పోరుకు తరలిరండి

Jun 23 2025 6:08 AM | Updated on Jun 23 2025 6:08 AM

నేటి

నేటి యువత పోరుకు తరలిరండి

ఉప్పెనలా..

మాజీ ఉప ముఖ్యమంత్రి

పీడిక రాజన్నదొర

సాలూరు: యువతకు ఉద్యోగాల కల్పన, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు తప్పడంతో వైఎస్సార్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న యువత పోరుకు ఉప్పెనలా తరలి రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మోసం చేశారని ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురంలో హెచ్‌పీ పెట్రోల్‌ బంకు నుంచి కలెక్టర్‌ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్టు తెలిపారు.

యువతకు కూటమి వెన్నుపోటు

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

పాలకొండ రూరల్‌: అధికారం కోసం కూటమి నాయకులు అమలు కాని హామీలతో అన్నివర్గాల వారిని నమ్మించి మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ మండిపడ్డారు. ముఖ్యంగా యువత, నిరుద్యోగులను, విద్యార్థులకు కూటమి వెన్నుపోటు పొడిచిందన్నారు. ఈ తీరును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ యువజన విభాగం, ముఖ్య నాయకులతో కలసి ఆదివారం ఆయన స్వగృహం వద్ద యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి నాయకులు, సీఎం చంద్రబాబు హామీల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరించ లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జరగలేదన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులను ఈ ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామని, అంతవరకూ రూ.3వేలు భృతి నిరుద్యోగులకు ఇస్తామని హామీనిచ్చి ఇంత వరకూ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. లోపాలు సరిదిద్దుకోలేక ప్రశ్నిస్తే వేధిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో యువతకు అండగా వైఎస్సార్‌ సీపీ సంయుక్తంగా నేడు కలెక్టర్‌కు వినతిపత్రం అందించనున్నట్టు తెలిపారు. నియోజకవర్గ, మండల యువజన విభాగాల అధ్యక్షులు పొట్నూరు లక్ష్మణరావు, అల్లు సురేష్‌కుమార్‌, పాలవలస దవళేశ్వరావు పాల్గొన్నారు.

యువత పోరుకు సన్నద్ధం

మాజీ ఎమ్మెల్యే కళావతి

వీరఘట్టం: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. ఆదివారం ఆమె స్వగృహం వండువలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న సోమవారం జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు.

నేటి యువత పోరుకు తరలిరండి 1
1/2

నేటి యువత పోరుకు తరలిరండి

నేటి యువత పోరుకు తరలిరండి 2
2/2

నేటి యువత పోరుకు తరలిరండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement