
జూలై 26, 27 తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు
బొబ్బిలి రూరల్: సీపీఐ 14వ జిల్లా మహాసభ లు జూలై 26, 27 తేదీల్లో బొబ్బిలి పట్టణంలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ వెల్లడించారు. మండలంలోని సీహెచ్ బొడ్డవలస గ్రామంలో సీపీఐ మండల సభను ఆదివారం నిర్వహించారు. మండల కార్యదర్శిగా కాగాన గణేష్ను ఎంపిక చేశారు. అనంతరం జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక పక్షాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తూ రైతు, పేద, బడుగు వర్గాల్లో వెలుగులు నింపేందుకు సీపీఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నిరుపేద, గిరిజనులకు భూ హక్కుల ను కల్పించడమే తమ పోరాటాల లక్ష్యమన్నా రు. జిల్లా మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా స భ్యులు కోట అప్పన్న, కార్యదర్శి కాగాన గణేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.