
పోస్టల్ పథకాలు ప్రజలకు చేరువచేయాలి
విజయనగరం టౌన్: పోస్టల్ శాఖ పథకాలను ప్రజలకు చేరువచేయాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ సూచించారు. సేవల్లో ఏపీ సర్కిల్ పరిధిలోని 127 డివిజన్లలో విజయనగరం తపాలా శాఖ వెస్ట్ సబ్డివిజన్ కార్యాలయం ప్రథమ బహుమతి కై వసం చేసుకుంది. ఈ మేరకు కంటోన్మెంట్ తపాలా కార్యాలయంలో విజయోత్సవ సభ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఉద్యోగులను అభినందిస్తూ పలు సూచనలు చేశారు. పోస్టల్ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. ప్రతి పథకంపై ప్రజలు అవగాహన పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ పోస్ట్మాస్టర్ ఇ.మధు, ఐపీబీపీ మేనేజరు సతీష్, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.