విజన్‌ డాక్యుమెంట్‌ జిల్లా యూనిట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

విజన్‌ డాక్యుమెంట్‌ జిల్లా యూనిట్‌ ప్రారంభం

Jun 10 2025 7:10 AM | Updated on Jun 10 2025 7:10 AM

విజన్‌ డాక్యుమెంట్‌ జిల్లా యూనిట్‌ ప్రారంభం

విజన్‌ డాక్యుమెంట్‌ జిల్లా యూనిట్‌ ప్రారంభం

విజయనగరం అర్బన్‌: స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ జిల్లా యూనిట్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వంగలపూడి అనిత కలెక్టరేట్‌లో సోమవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని జిల్లా ముఖ్యప్రణాళిక శాఖ కార్యాలయం వద్ద ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి అమరావతి నుంచి వర్చువల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలోకలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌, జేసీ ఎస్‌.సేతు మాధవన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, సీపీఓ జి.బాలాజీ, జిల్లా అధికారులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి సాధించాల్సి అభివృద్ధిని ఈ డాక్యుమెంట్లలో పొందుపరిచినట్లు చెప్పారు. అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి ఇలా శ్రీకారం చుట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement