కార్పొరేషన్‌ రుణాలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ రుణాలకు బ్రేక్‌

May 25 2025 8:12 AM | Updated on May 25 2025 8:12 AM

కార్ప

కార్పొరేషన్‌ రుణాలకు బ్రేక్‌

● దరఖాస్తు దారుల్లో ఆందోళన

పార్వతీపురం టౌన్‌: వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరు చేస్తాం.. యువత స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నామంటూ హడావిడి చేసిన కూటమి ప్రభుత్వం మాట మార్చింది. రుణాల మంజూరుకు బ్రేక్‌ వేసింది. దీంతో దరఖాస్తు చేసుకుని, రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న బీసీ, ఎస్సీ, ఈబీసీ, కావు సామాజిక వర్గాల లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. జిల్లాలో 266 బీసీ, 266 ఎస్సీ యూనిట్‌లకు దరఖాస్తులు ఆహ్వానించారు. బీసీ లబ్ధిదారులకు రూ.35 కోట్లు, ఎస్సీ లబ్ధిదారులకు రూ. 11.53కోట్లు విడుదల చేస్తామని మహాత్మాజ్యోతిబాపూలే జయంతి సాక్షిగా మంత్రి సంధ్యారాణి ఆర్భాంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన నమూనా చెక్కును విడుదలచేశారు. అయితే, రుణాల మంజూరుకు తాజాగా బ్రేక్‌ వేశారు. ఎంపిక జాబితాలను నిలిపివేయాలని, దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నార

ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే టార్గెట్‌..!

విజయనగరం క్రైమ్‌: బాంబు పేలుళ్ల కుట్ర కేసులో అరైస్టె.. పోలీస్‌ కస్టడీలో ఉన్న సిరాజ్‌, సమీర్‌లను విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారులు, స్థానిక పోలీసులకు విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, ఆలయాలను దర్శించుకునే భక్తులే టార్గెట్‌గా పేలుళ్లు జరపాలని నిర్ణయించినట్టు భోగట్టా. విజయనగరం జిల్లాలో అధికమంది భక్తుల ప్రాణాలు తీసేలా ఐదుచోట్ల బాంబులు పేల్చేందుకు ఇమ్రాన్‌, బలుజిస్తాన్‌ అనే వ్యక్తులతో కలిసి పథక రచన చేసినట్టు సిరాజ్‌ తెలిపినట్టు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌చేసి చాటింగ్‌ చేసినట్టు తెలిసింది. అవసరమైతే మానవబాంబుగా మారేందుకు కూడా సిద్ధపడినట్టు విచారణలో సిరాజ్‌ వెల్లడించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఆధారాల ఆధారంగా యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విజయనగరం పీటీసీలో రెండోరోజు సిరాజ్‌, సమీర్‌లను ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఐఏ బృందం విచారణ జరిపింది. తొలుత వీరిద్దరూ నోరుమెదిపేందుకు ఇష్టపడకపోవడంతో వేర్వేరుగా విచారణ జరిపారు. విజయనగరం ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్‌, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ల మధ్య కుదిరిన స్నేహం, ఇద్దరు సౌదీ, అక్కడ నుంచి ఉమెన్‌ దేశానికి ఎలా వెళ్లారు అన్న కోణంలో దర్యాప్తు సాగించినట్టు తెలుస్తోంది. సిరాజ్‌ కాల్‌ డేటా ఆధారంగా లోతుగా విచారణ జరుపుతున్నారు.

బీఏలో బిజిలీ ఫస్ట్‌

బొబ్బిలి: ఆంధ్రా యూనివర్సిటీ 2024–25 సంవత్సరంలో నిర్వహించిన బీఏ ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇందులో బొబ్బిలికి చెందిన యడ్ల బిజిలీ 9.04 పాయింట్లతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థినిని బొబ్బిలివాసులతో పాటు కళాశాల సిబ్బంది అభినందించారు.

తప్పిన ముప్పు

దత్తిరాజేరు: వైజాగ్‌ నుంచి బీహర్‌ రాష్ట్రం ధన్‌బాద్‌ వెళ్తున్న ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం పెదమానాపురం రైల్వే గేట్‌ వద్దకు వచ్చే సరికి చక్రాల నుంచి పొగలు వచ్చాయి. గేట్‌మన్‌ గమనించి కోమటిపల్లి స్టేషన్‌ మాస్టర్‌కు సమచారం అందించారు. రైలును అక్కడ కాసేపు నిలిపారు. రైలులో వస్తున్న పొగలు చూసి ప్రయాణికులు కంగారుపడ్డారు. స్వల్ప సాంకేతిక లోపంతో రైలు చక్రాలు వేడెక్కడంతో పొగలు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలును కాసేపు నిలిపిన తర్వాత కదలడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

కార్పొరేషన్‌ రుణాలకు బ్రేక్‌ 1
1/1

కార్పొరేషన్‌ రుణాలకు బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement