
పర్యాటకాభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ శ్యాంప్రసాద్
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ తెలిపారు. సీతంపేటలోని అడ్వంచర్ పార్కును సోమవారం సందర్శించారు. ఇక్కడ నూతన ఈవెంట్లు పెట్టడానికి గల సాధ్యసాధ్యాలను పరిశీలించారు. గిరి గ్రామదర్శిని, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అనువైన స్థలపరిశీలన చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామదర్శిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చిన్నారులు, యువతను ఆకర్షించేలా స్విమ్మింగ్ఫూల్, రెయిన్ డ్యాన్స్, లోస్లైడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్ర మంలో ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, డ్వామా పీడీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి యోగాంధ్ర పోటీలు
పార్వతీపురం టౌన్: యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా గ్రా మ స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభి క తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగా పోటీలు నిర్వహిస్తామని, ఇందులో విజేతలను రాష్ట్ర స్థా యి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. 10 నుంచి 19 సంవత్సరాలు, 20 నుంచి 35 ఏళ్ల మధ్య, 35 సంవత్సరాల పైబడిన వారికి వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. యోగాసన పోటీల్లో ప్రతిభ చూపాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో నియమించిన యోగా శిక్షకుల పేర్లును సంబంధిత పోర్టల్లో నమోదు చేయా లని ఎంపీడీఓలను ఆదేశించారు.
ఆధార్ ఇక్కట్లు
గుమ్మలక్ష్మీపురం: ఆధార్ కార్డుల అప్డేట్, పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, తదితర వివరాల మార్పుకోసం ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గుమ్మలక్ష్మీపురం మండలంలో ని గుమ్మలక్ష్మీపురం, ఇరిడి, కొండవాడ, బాలే సు గ్రామ సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను అధికారులు నిర్వహిస్తున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో ఆధార్ కార్డుల అప్డేట్లతో పాటు ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కార్డులు చేయించ డం తప్పనిసరైంది. విద్యుత్ సరఫరా అంతరాయం, సర్వర్ పనిచేయకపోవడంతో ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి ఆధార్ నమోదు కేంద్రాల సంఖ్యను పెంచా లని ప్రజలు కోరుతున్నారు.
కీచక ఉపాధ్యాయుడిపై దర్యాప్తు
రేగిడి: మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నిర్వాకంపై సోమవారం ఎంఈఓ–2 బి.ఎరకయ్య దర్యాప్తు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేశాడన్న వార్త సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో రావడంతో దర్యాప్తునకు డీఈఓ మాణిక్యంనాయుడు ఆదేశించారు. ఆ పాఠశాల హెచ్ఎంను సోమవారం ఎంఈఓ–2 వెళ్లి కలిసి వివరాలు సేకరించారు. పాఠశాలలో అటువంటి ఘటనలు చోటుచేసుకోలేదని హెచ్ఎం తెలిపారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేసినట్టు ఎరకయ్య తెలిపారు.

పర్యాటకాభివృద్ధికి చర్యలు