
30న తోటపల్లిలో యోగాంధ్ర
గరుగుబిల్లి: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 30న తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు కుడిమట్టి కట్ట వద్దనున్న ఐటీడీఏ పార్క్, బోటు షికారు, తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆల య పరిసరాలను ఆయన సోమవారం పరిశీలించా రు. పర్యాటక ప్రాంతాల్లో నిర్వహణలో భాగంగా వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జూన్ 5న సీతంపేటలోని అడ్వెంచర్ పార్క్లోను, 12న మక్కువ మండలం వెంగళరాయసాగర్ వద్ద నున్న ఏనుగు కొండ వద్ద యోగా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఆయన వెంట పార్వతీపురం ఐటీడీఏ పీఓ, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్త వ, ఎంపీడీఓ జి.పైడితల్లి ఉన్నారు.