మరో దారిలేక.. | - | Sakshi
Sakshi News home page

మరో దారిలేక..

May 27 2025 12:40 AM | Updated on May 27 2025 12:40 AM

మరో ద

మరో దారిలేక..

మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025

8లో

చందాలతో రోడ్డును బాగుచేసుకుంటున్న

కొండబిన్నిడి గ్రామస్తులు

అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మిస్తామని కూటమి నేతలు నమ్మబలికారు. అధికారం చేజిక్కించుకుని ఏడాది గడుస్తున్నా గిరిజనుల దారి కష్టాలపై కన్నెత్తి

చూడడంలేదు. తమ గోడు వినిపించేందుకు

మరో ‘దారి’లేక.. గిరిజనులు శ్రమదానం, చందాలు వేసుకుని రాళ్ల దారులను రాకపోకలకు అనువుగా మార్చుకుంటున్నారు. గిరిజన ప్రజలను చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వం తీరును దుయ్యబడుతూ రోడ్ల పనుల్లో శ్రమదానం

చేస్తున్నారు.

చందాలతో..

గుమ్మలక్ష్మీపురం మండలంలోని చాపరాయి బిన్నిడి పంచాయతీ కొండబిన్నిడి గ్రామం గిరిశిఖరాన ఉంది. 30 కుటుంబాలు జీవిస్తున్న ఈ గ్రామానికి ఇప్పటి వరకూ రోడ్డు సౌకర్యం లేదు. మూలబిన్నిడి నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే ఈ గ్రామ ప్రజలకు ‘మార్గం’సుగమమవుతుంది. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఒక్కో ఇంటికి రూ.5వేలు చొప్పున చందాలు వేసుకుని జేసీబీ సాయంతో రోడ్డును నిర్మించుకున్నట్టు గ్రామానికి చెందిన

ఎం.రంజిత్‌ కుమార్‌, ఎం.గణేష్‌, దొరబాబు, చిన్నారావు తదితరులు తెలిపారు.

శ్రమదానంతో..

గుమ్మలక్ష్మీపురం మండలంలోని చినరావికోన గ్రామానికి పాములగీసాడ నుంచి గల 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో రాళ్లు తేలి, గుంతల్లో నిండిన రోడ్డును గ్రామస్తులు శ్రమదానంతో రాకపోకలకు అనువుగా మార్చుకుంటున్నారు. సుమారు 300 మంది జనాభా నివసిస్తున్న గిరిజన గ్రామానికి ప్రభుత్వం తక్షణమే పక్కారోడ్డు నిర్మించాలని గణేష్‌, శంకారావు, తమ్మన్న, దయానంద్‌, జమ్మన్న తదితరులు డిమాండ్‌ చేశారు.

–గుమ్మలక్ష్మీపురం

న్యూస్‌రీల్‌

మరో దారిలేక.. 1
1/2

మరో దారిలేక..

మరో దారిలేక.. 2
2/2

మరో దారిలేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement