
శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025
● రణరంగానికి వచ్చినట్లుగా కౌన్సిల్ సమావేశానికి.. ● ముందస్తు ప్రణాళిక అన్నట్లుగా పోలీసుల మోహరింపు ● ప్రారంభానికి ముందే బాహాబాహీ ● రౌడీ షీటర్లంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను రెచ్చగొట్టిన ఫిరాయింపు కౌన్సిలర్ ● సైకో చైర్పర్సన్ అంటూ మరోసారి ఓ మహిళపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ● పక్కా టీడీపీ కార్యకర్తల మాదిరి వ్యవహరించిన ఖాకీలు ● వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను నెట్టుకొంటూ బయటకు పంపించిన వైనం
సాక్షి, పార్వతీపురం మన్యం:
●ఒక మున్సిపల్ సమావేశానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం ఎప్పుడైనా చూశామా.. పోనీ, పాలకవర్గమేమైనా తమకు రక్షణ కల్పించాలని కోరిందా..
ఇంతకుముందు ఎన్నడైనా పెద్ద స్థాయిలో ఘర్షణలు జరిగాయా? మరి ఎవరి
డైరెక్షన్లో పోలీసులు పార్వతీపురం మున్సిపల్ సమావేశానికి వచ్చినట్లు.. ఎవరి డైరెక్షన్లో సమావేశం ప్రారంభంలోనే
లోపలికి ప్రవేశించినట్లు..!! ●
●
●ఇరువురు ఘర్షణ పడితే.. ఇద్దరికీ
సర్దిచెప్పి, అక్కడ నుంచి పంపించేయడానికి ప్రయత్నించడం, రాజీ కుదర్చడం ధర్మం. అలా అని ఒకరిని వదిలి.. రెండో వ్యక్తిని నెట్టుకొంటూ, తోసుకుంటూ.. కలబడుతూ బయటకు లాక్కెళ్లడం.. అదీ ధర్మం కోసం పని చేసే ఒక పోలీస్ అలా చేయడం న్యాయమేనా? పోలీసులు ఎవరి
కనుసన్నల్లో పని చేస్తున్నట్లు? ●
●దాదాపు అయిదు నెలల తర్వాత శుక్రవారం జరిగిన పార్వతీపురం మున్సిపల్ బడ్జెట్ సమావేశం పట్టుమని 20 నిమిషాలైనా నడవకుండానే ముగిసిపోయింది. బడ్జెట్, సాధారణ సమావేశాలు నిర్వహించాలని.. మున్సిపల్ అభివృద్ధిపై చర్చ
జరపాలని పట్టుబట్టి, పోరాటం చేసి మరీ పాలకవర్గ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ సభ్యులు దానిని సాధిస్తే... అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో కూటమి సభ్యులు పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చి, సమావేశాన్ని రచ్చచేసి వెనుదిరిగారు. అక్కడ జరగబోతోంది రణరంగమా అన్నట్లు.. పెద్ద ఎత్తున పోలీసులను వెంటబెట్టుకుని మరీ వివాదం చేయడం పట్టణ ప్రజలను విస్మయపరిచింది. ●
న్యూస్రీల్

శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025