
జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాలను అమలు చేయాలి
విజయనగరం ఫోర్ట్: జల్జీవన్ మిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. జాతీయ జల్జీవన్ మిషన్ సభ్యుల సూచనల మేరకు కార్యక్రమం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. జాతీయ జేజేఎం అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్లు జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. కవిత పాల్గొన్నారు.
ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్