పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన యువత పోరులో పాల్గొన్న
వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వ పాలనలో దగా పడిన విద్యార్థులు, నిరుద్యోగ యువత తరఫున వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన యువత పోరు కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అభిమానులు తరలివచ్చారు. నినాదాలతో జిల్లా కేంద్రాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను నమ్మి, తాము పడుతున్న అవస్థలను ఏకరువు పెట్టారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగించి కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నిరుద్యోగులంతా ఐక్యంగా తిప్పికొట్టారని, యువత పోరును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి గురువారం ఓ ప్రకటనలో పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
యువత పోరు విజయవంతం