పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఎకై ్స జ్ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో నవోదయం 2.0 కార్యక్రమంపై గురువారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. అనంతరం నవోదయం 2.0 ప్రచార రథం, పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో 137 గ్రామాలను ఏ, బీ, సీ గ్రామాలుగా వర్గీకరించి దత్తత అధికారులను నియమించామన్నారు. సారా సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 14405 పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. 1,265 పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి, వారిలో 191 మందిని బైండోవర్ చేసిన విషయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంతర రాష్ట్ర సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని, పటిష్ట నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పార్వతీపురం మున్సిపాలిటీ ఇందిరా కాలనీలో నవోదయం 2.0 ప్రచార రథంతో అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఐటీడీఎ పీఓ ఆశుతోష్ శ్రీవాస్తవ, ఏఎస్పీ అంకిత సురానా, ఎకై ్సజ్ ఏసీ పైడి రామచంద్రరావు, ఎౖక్సైజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాథుడు, ఏఈఎస్ జీవన్కిశోర్, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
23 నాటికి సర్వే పూర్తిచేయాలి
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేను ఈ నెల 23 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నాటికి తొలిదశ నిర్మాణాలు పూర్తిచేసిన వారి ఖాతాలకు 21న నగదు జమచేస్తామన్నారు.
15న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం
జిల్లాలో ఈ నెల 15వ తేదీన ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తహసీల్దార్లకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో రీసర్వే పక్కాగా నిర్వహించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. సీబీజీ(కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్)కోసం ప్రతీ మండలంలో ఐదు వందల ఎకరాల వరకు ప్రభుత్వ స్థలం అవసరమని, అందుబాటులో ఉన్న మండలాల వివరాలను అందజేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో పీఓలతో పాటు డీఆర్వో కె.హేమలత, కెఆర్ఆర్ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.