
మాట్లాడుతున్న వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్కుమార్
● జిల్లా అధికారులకు వ్యవసాయ శాఖ
కమిషనర్ అరుణ్కుమార్ సూచన
విజయనగరం అర్బన్: ప్రజా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆహార పంటల సాగు లాభదాయకమని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసా య శాఖ కమిషనర్ అరుణ్కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. అన్ని రకాల పంటలకు గిట్టుబా బు ధర లభించేలా సహాయ, సహకారాలు అందించాలన్నారు. జిల్లాకు శుక్రవారం వచ్చిన ఆయన జేసీ చాంబర్లో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పంటల సాగు, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు, బిల్లుల చెల్లింపు, బీమా పరిహారాల అందజేత తదితర అంశాలపై చర్చించారు. గత సీజన్ నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ, ప్రజాపంపిణీ వ్యవస్థలో జరిగిన పరిణామాల గురించి, తీసుకున్న చర్యల గురించి జేసీ మయూర్అశోక్ వివరించారు. గత సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రవాణా భత్యం చెల్లింపులపై కమిషనర్ ఆరా తీశారు. త్వరితగతిన బిల్లులు చెల్లించాలని సివిల్ సప్లై డీఎంను అదేశించారు. ఎండీయూ వాహన చోదకులకు ప్రమాదబీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే రిజస్టరై ఎవరైనా మృత్యువాత పడి ఉంటే వివరాలు పంపించాలని డీఎస్ఓకు సూచించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, చిరుధా న్యాల సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. జేసీ కె.మయూర్అశోక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామారావు, డీఎస్ఓ మధుసూదనరావు, సహకార అధికారి రమేష్, వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.