
మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
● అందుకే ప్రజలు నమ్మడం లేదు ● డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: చంద్రబాబు ఇటీవల మహానాడులో ప్రకటించినది మోసపూరిత మేనిఫెస్టో.. అందుకే ప్రజ లు నమ్మడం లేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షే మ శాఖమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూ రు పట్టణంలో విలేకర్లతో శుక్రవారం ఆయన మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి పాలనకు నిర్వచనం జగన్మోహన్రెడ్డి పాలన అని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అర్హులైన అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలవల్ల రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని, అభివృద్ధి లేదంటూ టీడీపీ నాయకులు నాడు విమర్శలు చేశా రని, నేడు వారి నేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని ఉచితాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రం మేనిఫెస్టోను కాపీ కొట్టారని విమర్శించారు. మహిళలు, యువత, రైతులను ఎన్నికల సమయంలో మభ్యపెట్టేందుకు చేసే ప్రయత్నాలు పారవన్నారు. మంచి చేసే నాయకు డు ఎవరో ప్రజలకు తెలుసున్నారు. నాడు చంద్రబా బు చేసిన మోసం, దగాను ఎవరూ మర్చిపోలేద న్నారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక 14 వేల కోట్లను మాఫీచేయని చంద్రబాబు.. నేడు మరలా అధికారంలోకి వస్తే అమ్మకు వందనం పథకం కింద ఏడాదికి సుమారు లక్షా 44 వేల కోట్ల రూపాయలు మహిళలకు ఇస్తానని తెలప డం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి అవగాహన లేకుండా, ఆర్థిక వనరులు గురించి ఆలోచించకుండా ప్రజలను మోసం చేసేందుకే పథకాలను ప్రకటించారన్నారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను అప్పటి ప్రభుత్వం ఏ మేరకు అమలుచేసిందో బహిరంగ చర్చకు చంద్రబాబు లేదా టీడీపీ రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకత్వం ఎవరు వచ్చినా తాను సిద్ధమని సవాల్ విసిరారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమ ర్శించారు. టీడీపీ ఓటమిని ముందుగానే గుర్తించిన చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి కొనసాగుతుందని, జగన్మోహన్రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.