షటిల్ డబుల్స్ టోర్నమెంట్ విజేత విజయవాడ జట్టు
నాదెండ్ల: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతోపాటు యువత మధ్య స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయని సీఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుండి రంగనాయకులు అన్నారు. గణపవరం సీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయి షటిల్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీఆర్ కళాశాల షటిల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో నియోజకవర్గ స్థాయిలో 30 జట్లు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయిలో 40 జట్లు పాల్గొన్నాయి.
మూడు జిల్లాల స్థాయి విజేతలు..
మూడు జిల్లాల స్థాయిలో విజయవాడకు చెందిన ధనుష్, చంద్రగోపీ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. రెండో బహుమతి విజయవాడకు చెందిన విజయ్సాయిరెడ్డి, పోతురాజు దక్కించుకున్నారు. మూడో బహుమతి గణపవరం గ్రామానికి చెందిన జాక్సన్, పృధ్వీ, నాలుగోబహుమతి కోండ్రుపాడు, గణపవరానికి చెందిన ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు.
నియోజకవర్గ స్థాయి విజేతలు..
నియోజకవర్గ స్థాయిలో మొదటి బహుమతి చిలకలూరిపేటకు చెందిన ఖాదర్, నవీన్ గెలుపొందారు. రెండో బహుమతి గణపవరానికి చెందిన జాక్సన్, పృధ్వీ, మూడో బహుమతి చిలకలూరిపేటకు చెందిన శ్రీనివాసరావు, శేషిరెడ్డి, నాలుగో బహుమతి కోండ్రుపాడు, యడ్లపాడుకు చెందిన ఆదినారాయణ, ప్రసాద్లు దక్కించుకున్నారు. విజేతలకు కమిటీ సభ్యులు నగదు బహుమతి, షీల్డ్ అందించారు. న్యాయనిర్ణేతలుగా కొండెపాటి నాగయ్య, రమేష్, నరేంద్ర, గేరా యాకోబు వ్యవహరించారు. కమిటీ సభ్యులు యశ్వంత్చౌదరి, సాయిచౌదరి, పట్నంశెట్టి మణికంఠ, నాని, బాష, ఆదినారాయణ పర్యవేక్షించారు.
ముగిసిన షటిల్ డబుల్స్ టోర్నమెంట్
షటిల్ డబుల్స్ టోర్నమెంట్ విజేత విజయవాడ జట్టు


