దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు

Oct 31 2025 7:36 AM | Updated on Oct 31 2025 7:36 AM

దేశంల

దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు

● పాస్టర్లు, చర్చిలపై దాడుల నివారణకై ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టం తేవాలి ● ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన ● కలెక్టరేట్‌ వద్ద నిరసన అనంతరం రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాస్టర్‌ జి.సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ క్రైస్తవ్యం అనేది మతం కాదని అది ఒక ఆచరణ మాత్రమేనన్నారు. గుంటూరులో, ఇతర ప్రాంతాల్లో క్రైస్తవ సమాధులతోటలకు ప్రత్యేక స్థలాలను కేటాయించాలని కోరారు. వట్టి చెరుకూరు మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షుడు డి.సుందర్‌ సింగ్‌, లూధరన్‌ చర్చి పాస్టర్లు రెవరెండ్‌ శామ్యూల్‌ కోటేశ్వరరావు, బిషప్‌ రెవరెండ్‌ వరబాబు, వీరారెడ్డి, షేక్‌ మదార్‌, పాస్టర్‌ దయరత్నం, క్రైస్తవ సంఘ నాయకులు లింగం గుంట్ల సాల్మన్‌ రాజు, ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ యూత్‌ అసోసియేషన్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గడ్డం సురేష్‌, ఇద్వా సంఘం అధ్యక్షులు బేతపూడి భారతి తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూనగర్‌: దేశవ్యాప్తంగా క్రైస్తవులపై, చర్చిలపై దాడులు పెరిగిపోతున్నాయని.. క్రైస్తవుల రక్షణకై వెంటనే ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ యూత్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ గోళ్లమూడి రాజసుందరబాబు డిమాండ్‌ చేశారు. క్రైస్తవులు, చర్చిల రక్షణకు, పాస్టర్ల, సువార్తికులు, దైవసేవకుల రక్షణకు క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఐక్య క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట మోకాళ్లపై కూర్చోని క్రైస్తవ అత్యాచర చట్టం రూపొందించేందుకు ప్రభుత్వాలకు తగిన కనువిప్పు కలగాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రాజసుందరబాబు మాట్లాడుతూ చర్చిలలో పాస్టర్లు శాంతి సమాధానాలు గురించే బోధించడం జరుగుతుందని, ఎటువంటి హింసాత్మక బోధనలు చేయరని అటువంటి వారిపై నిరంతరం దాడులు జరగడం శోచనీయమన్నారు. క్రైస్తవ మిషనరీలు విద్య, వైద్యాన్ని దేశానికి అందించారన్నారు. వారు చేసిన సేవల వల్ల భారతదేశంలో పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు సంభవించాయన్నారు. అనంతరం 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్‌ ఆశుతోష్‌ శ్రీవాస్తవకు అందజేశారు.

దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు 1
1/1

దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement