
రైతు బేజారులు
పల్నాడు
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం శుక్రవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం.
అమ్మవారికి బోనాలు
పిడుగురాళ్ల: ఆషాఢ మాసం నేపథ్యంలో స్థానిక భవానీనగర్లోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం అమ్మ వారికి మహిళా భక్తులు బోనాలు సమర్పించారు.
ముగిసిన సదరం క్యాంప్
తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది.
సాక్షి, నరసరావుపేట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తే తగిన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు సైతం మధ్యవర్తులు లేకుండా రైతుల నుంచే కొనుగోలు చేయడం వల్ల తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు లభిస్తాయి. దీని వల్ల ఇరువురికి లాభం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే రైతు బజార్లు తెరపైకి వచ్చాయి.
ఒకే ఒక్కటి.. అదీ అంతంతే..
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిఽధిలో ప్రస్తుతం చిలకలూరిపేటలో మాత్రమే రైతు బజారు అందుబాటులో ఉంది. మిగిలిన చోట్ల కర్షకులు, వినియోగదారులు నష్టపోతున్నారు. జిల్లాలో ముఖ్యంగా నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ నియోజకవర్గాలలో కూరగాయలు, ఆకుకూరలు పెద్ద సంఖ్యలో పండిస్తారు. వీటిని నేరుగా రైతులే విక్రయించాలంటే గుంటూరు, విజయవాడ వంటి నగరాలలో ఉన్న రైతుబజార్లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రవాణా చార్జీలు తడిసిమోపడవడంతో రైతులు లాభం కళ్ల చూసే అవకాశం లేకుండాపోతోంది. దీన్ని ఆసరాగా తీసుకొని దళారులు చెప్పిందే తుది ధర అవుతోంది.
వినియోగదారులపై భారం...
రైతు బజార్లు లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నట్టే వినియోగదారులు సైతం మోసపోతున్నారు. మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరలు విక్రయించే వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. రైతులకు అవకాశం ఇస్తే ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. మరోవైపు ఒక్కోసారి టమోటా, ఉల్లి వంటి నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటినప్పుడు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ ధరలకు రైతు బజార్లలో విక్రయిస్తోంది. జిల్లాలో రైతు బజార్లు లేకపోవడంతో స్థానికులకు ఇవి చేరడం లేదు. రైతు బజార్ల వల్ల పలువురికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
7
న్యూస్రీల్
అందుబాటులోని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు మేలు
జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలలో రైతు బజార్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టి పెడితే వాటి ఏర్పాటు సులువవుతుంది.
జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పల్నాడు బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ పక్కన రైతు బజార్ కోసం కేటాయించిన స్థలం, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకుని పేట ప్రజలకు రైతు బజారును వెంటనే అందుబాటులోకి తీసుకురావచ్చు.
వినుకొండ ఎన్నెస్పీ స్థలంలో రైతు బజారు కోసం కొంత స్థలాన్ని గతంలో కేటాయించారు. అందులో ఇకనైనా తగిన ఏర్పాట్లు చేసి రైతు బజారు ఆరంభించాలనేది ప్రజల ఆకాంక్ష.
సత్తెనపల్లిలో మార్కెట్ యార్డులో రైతు బజారు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగం లేకుండా పోతోంది. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెడితే తిరిగి వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందని రైతులు, వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి వంటి చోట్ల సైతం రైతు బజార్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. కూటమి నేతలు, ప్రభుత్వ అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తే రైతు బజార్ల ఏర్పాటు సులువు కానుంది. రైతులు, వినియోగదారులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు.
చెమట చిందించి సాగు చేసిన రైతుకు పంట విక్రయం పెద్ద సమస్యగా ఉంది. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసే వారికి అందుబాటులో రైతు బజార్లు లేక బేజారవుతున్నారు. దూర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిద్దామంటే ఖర్చులే తడిసిమోపడవుతున్నాయి. స్థానికంగా దళారుల దందాకు అన్నదాతలే బలవుతున్నారు. ఇటు తక్కువ ధరకు కూరయగాలు, ఆకుకూరలు వంటివి లభించిక వినయోగదారులు నష్టపోతున్నారు. మొత్తానికి ప్రజలకు అవస్థలు అన్నీఇన్నీ కావు.
నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఏర్పాటుకు నోచుకోని రైతుబజార్లు
రైతు బజార్లు లేక ఇటు రైతులు,
అటు వినియోగదారులకు ఇబ్బందులు
ఇతర ప్రాంతాలకు వ్యయప్రయాసలతో
వెళ్లి విక్రయించాల్సిన దుస్థితి
అధిక ధరలకు వ్యాపారుల వద్ద
కూరగాయలు కొంటున్న
వినియోగదారులు
అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో
ఏర్పాటుకు రైతులు, ప్రజలు డిమాండ్

రైతు బేజారులు

రైతు బేజారులు

రైతు బేజారులు

రైతు బేజారులు

రైతు బేజారులు