సి‘ఫార్సు’ల బది‘లీలలు’ | - | Sakshi
Sakshi News home page

సి‘ఫార్సు’ల బది‘లీలలు’

Jun 28 2025 7:34 AM | Updated on Jun 28 2025 7:34 AM

సి‘ఫార్సు’ల బది‘లీలలు’

సి‘ఫార్సు’ల బది‘లీలలు’

నెహ్రూనగర్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌లో పనిచేసే సచివాలయ సెక్రటరీలకు బదిలీల కౌన్సెలింగ్‌ శనివారం, ఆదివారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు అడ్మిన్‌ సెక్రటరీలు, వార్డ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలు, వార్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలు, వార్డ్‌ శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్వెంట్‌ సెక్రటరీలు, వార్డ్‌ ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్‌ ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలు హాజరుకావాలి. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్‌ ప్రాంతంలో కూడా ఈ నెలఖారులోపు నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.

వీరికి ప్రాధాన్యత

వార్డు సచివాలయ సెక్రటరీల బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజ్‌డ్‌ సిబ్బందికి, మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద క్యాన్సర్‌, హార్ట్‌ సర్జరీ, కిడ్నీ మార్పిడీ, మానసిక వ్యాధుల కలిగిన పిల్లల తల్లిదండ్రులకు, స్పౌజ్‌ కేటగిరి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్లులోపు సర్వీస్‌ ఉన్నవారికి రిక్వస్ట్‌ మీద బదిలీలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వారికి కేటాయించిన సచివాలయంలో పరిధిలోనే విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్బన్‌ లోకల్‌ బాడీస్‌(యూఎల్‌బీ)అయితే సొంత వార్డులో పోస్టింగ్‌ రాదు. రూరల్‌ ప్రాంతాల్లో అయితే సొంత మండలంలో పోస్టింగ్‌ కేటాయించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా

11082 మంది సెక్రటరీలు

గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్బన్‌, రూరల్‌ కలుపుకుని 1344 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 11082 మంది సెక్రటరీలు పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది సెక్రటరీలు డెప్యూటేషన్‌పై వెళ్లిన వారు ఉన్నారు. వీరు కూడా కౌన్సెలింగ్‌కు హాజరై మిగుల ఉద్యోగుల కింద ఉండనున్నారు. వీలైతే డెప్యూటేషన్‌పై పనిచేసే సెక్రటరీలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

కార్పొరేటర్ల దందా

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సెక్రటరీలు వేరే సచివాలయానికి బదిలీ కావడానికి ఆయా ప్రాంత కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు లేఖలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గళ్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో బూర్ల రామాంజనేయులు దగ్గర నుంచి తమకు అనుకూలంగా ఉండే సచివాలయ ఉద్యోగులను పోస్టింగ్‌ ఇప్పించుకునేందుకు లెటర్లు ఇప్పిస్తున్నారు. దీనికి గానూ ఒక్కో సెక్రటరీ నుంచి రూ.20 నుంచి 25 వేలు దాకా కార్పొరేటర్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నేటి నుంచి సెక్రటరీల

బదిలీలకు కౌన్సెలింగ్‌

నచ్చిన సచివాలయంలో పోస్టింగ్‌

కోసం ఎమ్మెల్యేల నుంచి

సిఫార్సుల లేఖలు

లెటర్లు ఇప్పిస్తామంటూ

కార్పొరేటర్లు నగదు వసూలు

పారదర్శకంగా నిర్వహించాలని

కోరుతున్న సెక్రటరీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement