
భారీ అగ్నిప్రమాదం
వ్యర్థాల గోదాములో
వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ గోదాములో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి పదేళ్లుగా ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు గోదాములో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. కనీస అనుమతులు కూడా లేవని సమాచారం. మున్సిపల్, అగ్నిమాపక కేంద్రం అధికారులు మంటలను అదుపు చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనరు సుభాష్ చంద్రబోస్, ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో రూ.1.10 కోట్ల మేరకు ఆస్తినష్టం వాటలిట్లిందని బాధితుడు తెలిపారు.
● రూ.1.10 కోట్ల మేర ఆస్తి బుగ్గిపాలు
● తగిన జాగ్రత్తలు
పాటించకపోవడంతో భారీ నష్టం

భారీ అగ్నిప్రమాదం