ప్రణమిల్లిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

ప్రణమిల్లిన భక్తజనం

Jun 28 2025 7:34 AM | Updated on Jun 28 2025 7:34 AM

ప్రణమిల్లిన భక్తజనం

ప్రణమిల్లిన భక్తజనం

మౌలిక వసతుల పరిశీలన

ఇంద్రకీలాద్రిపై ఉత్సవాల నేపఽథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను నోడల్‌ అధికారి టి.చంద్రకుమార్‌ పరిశీలించారు. నోడల్‌ అధికారి వెంట దుర్గగుడి ఈవో శీనా నాయక్‌, ఆలయ అధికారులు తదితరులు ఉన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపఽథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులోని ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకుంది.

కిటకిటలాడిన క్యూలైన్లు

ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతోపాటు ఘాట్‌ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్‌తో పాటు రూ. 100, రూ. 300 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.

అమ్మవారి సారె సమర్పణకు

తరలివస్తున్న భక్తబృందాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement