
డ్రగ్స్తో జీవితాలు దుర్భరం
నరసరావుపేట: సమాజ హితం కోసం మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్కుమార్, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పల్నాడురోడ్డులోని ఏరియా హాస్పటల్ నుంచి కలెక్టరేట్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్స్ వరకు వాకథాన్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ సమష్టి కృషి ద్వారానే సాధ్యమవుతుందన్నారు. సరదాగా మొదలై, చివరకు బానిసలుగా మార్చి జీవితాలను సర్వనాశనం చేస్తుందని హెచ్చరించారు. గంజాయి విక్రయించేవారు, సేవించే వారిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972కు కాల్చేసి తెలియచేయాలని కోరారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వాకథాన్లో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఈగల్ ఎస్ఐ శామ్యూల్రాజు, కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు, నర్సింగ్ విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
‘జిందాల్’ ప్లాంట్ సందర్శన
యడ్లపాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం జిందాల్ ఫ్యాక్టరీను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వారు జిందాల్ ఫ్యాక్టరీని సందర్శించారు. సీఎం హెలిప్యాడ్ గ్రౌండ్ను పరిశీలించి భద్రత చర్యలపై చర్చించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై నరసరావుపేటలో వాకథాన్ పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, విద్యార్థులు