
అనుగృహం లేదు
నరసరావుపేట: సొంతిల్లు అనేది పేద, మధ్యతరగతి ప్రజలకు ఒక కల. ఆ కలలను నేటి కూటమి ప్రభుత్వం కల్లలుగా చేసింది. తాము అధికారంలోకి వస్తే.. పట్టణంలో రెండుసెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ మహిళలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. తమకు ఇళ్ల స్థలాలు కావాలంటూ అర్హులైన పేదలు ఏడాదిగా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అర్జీలు అందజేస్తున్నారు. అయితే వాటిలో ఏ ఒక్కటీ పరిష్కరం కాకపోగా.. అవన్నీ బుట్టదాఖలుగానే మిగిలిపోతున్నాయి.
● వీరికోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు రూ.35కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించారు. ఇల్లు కట్టుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు అందజేస్తే మిగతా రూ.50వేలను కలిపి రూ.2లక్షలు అందజేశారు. ఇసుక, స్టీలు, ఇటుక, సిమెంట్ ఫ్రీగా అందజేశారు.
● వీరిలో 1893 మంది ఇళ్లు పూర్తిచేసుకుని, గృహ ప్రవేశాలు చేశారు. రూఫ్ను 266 గృహాలు పూర్తిచేసుకోగా, రూఫ్ లెవెల్కు 143, లెంటిల్ లెవెల్కు 45 చేరాయి.
● ఇల్లు పూర్తయిన తర్వాత లబ్ధిదారులైన మహిళల పేరుతోనే రూ.1 ఖర్చుతో వారిపేరుపై రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. దీంతో పాటు ఐదేళ్లు గడిచిన పిమ్మట వాటిని మరొకరికి విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు.
● జిల్లాలో 16 ప్రదేశాల్లో జగనన్న కాలనీలను ఏర్పాటుచేసి అందులో 38049మందికి ఇళ్ల పట్టాలు అందజేయగా ఇప్పటివరకు 14,972 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. వీటిలో మూడోవంతుకుపైగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే లబ్ధిదారులు పూర్తిచేసుకున్నారు.
హామీ నెరవేర్చాలి
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలుచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఏడాది గడుస్తున్నా దాని ఊసే లేకపోవటం బాధాకరం. ఇళ్లు అవసరమైన వారు ఎంతోమంది ఉన్నారు. ఇచ్చిన హామీని మరిస్తే పేదల తరఫున పోరాటానికి సిద్ధం.
–పి.వెంకటేశ్వరరావు, గిరిజన కార్పొరేషన్ మాజీ డైరెక్టర్
జగనన్న కాలనీలో పూర్తయిన గృహాలు(పైల్)
పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఏడాదిగా అన్ని గ్రీవెన్సుల్లోనూ అర్జీలు, అధికారులకు వినతులు అయినా ప్రయోజనం శూన్యం సెంటు స్థలమైనా ఇవ్వని కూటమి ప్రభుత్వం ఇళ్లకోసం వేలాదిగా ఎదురుచూస్తున్న పేదలు సొంతిల్లు లేక అద్దె ఇళ్లల్లో పేదల ఇక్కట్లు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపైనా చిన్నచూపు
నాడు పేదలందరికీ పట్టాలు, ఇళ్లు