మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు | - | Sakshi
Sakshi News home page

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు

May 26 2025 1:27 AM | Updated on May 26 2025 1:27 AM

మదిని

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు

చిలకలూరిపేట: కన్నుల పండువగా సంప్రదాయ నృత్యాలు, వీనుల విందుగా సుమధుర సంగీత కీర్తనలు, నాట్య కళాకారుల ఉత్సాహపూరిత ప్ర దర్శనల మధ్య కళా నిలయం 40వ జాతీయ స్థా యి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు సూర్య, చంద్ర విభాగాల్లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి ,చక్కటి హావభావాలతో నాట్యకళ ప్రదర్శించి, నటరాజ వారసులమని నిరూపించారు. కీర్తన, మూషిక వాహన, గణపతి కౌతం, వినాయక కౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతార శబ్దం,జనుత శబ్దం,కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహ వైభవం, హిమగిరి తనయ, అలవేల్‌ మంగ వంటి కీర్తనలకు లయబద్ధంగా నర్తించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేసి వారి ప్రశంసలను అందుకున్నారు. ఒకవైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యకళ బోధించిన నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు. నేటి కార్యక్రమాలు సూర్య, చంద్ర విభాగాల్లో జానపద నృత్య పోటీలతో పాటు శాసీ్త్రయ జంట నాట్యాలు, అశాసీ్త్రయం జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, అశాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్యనాటికల పోటీలు సోమవారం నిర్వహిస్తారు. వీటితో పాటు నాట్యాచార్యులకు సన్మానాలు ఉంటాయి.

రెండో రోజు ఆకట్టుకున్న నాటికలు

నాదెండ్ల: మండలంలోని సాతులూరులో నటరత్న ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ తృతీయ జాతీయ నాటికల పోటీలు ఆదివారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో గుంటూరు ఆరాధన ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శన నిలిచిపోయింది. ఆదివారం తొలిగా ప్రదర్శించారు. అనంతరం కొలకలూరి శ్రీసాయి ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ‘జనరల్‌ బోగీలు’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్‌ రచనకు గోపరాజు విజయ్‌ దర్శకత్వం వహించారు. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘దొందూ దొందే’ నాటిక ప్రదర్శించారు. రచనా దర్శకత్వం డేవిడ్‌రాజు వహించారు. ఏలూరు హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘సారీ రాంగ్‌ నంబర్‌’ నాటికకు రచయితగా చింతల మల్లేశ్వరరావు, దర్శకుడిగా మహమ్మద్‌ ఖాజావలి వ్యవహరించారు. సామాజిక రుగ్మతలు, సందేశాలను నాటికలు ప్రస్ఫుటించాయి. జ్యోతి ప్రజ్వలన బండారుపల్లి మస్తాన్‌రావు, సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు చేయగా, సభాధ్యక్షత గరికపాటి వెంకట రామారావు వహించారు.

నేటి ప్రదర్శనలు : బాపట్ల సహృదయ ద్రోణాదుల వారి ‘వర్క్‌ఫ్రం హోమ్‌’, సాతులూరు వజ్జా రామనాథం ఆర్ట్స్‌ ‘రారాజు సుయోధన’, వరంగల్‌ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ‘ఏకాకి’ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

రెండో రోజు కొనసాగిన కళానిలయం జాతీయ స్థాయి పోటీలు

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు 1
1/3

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు 2
2/3

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు 3
3/3

మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement