నేడు సీనియర్‌ స్విమ్మర్ల జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నేడు సీనియర్‌ స్విమ్మర్ల జిల్లా జట్ల ఎంపిక

May 25 2025 8:04 AM | Updated on May 25 2025 8:04 AM

నేడు సీనియర్‌ స్విమ్మర్ల  జిల్లా జట్ల ఎంపిక

నేడు సీనియర్‌ స్విమ్మర్ల జిల్లా జట్ల ఎంపిక

నరసరావుపేట ఈస్ట్‌: శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల ఈత కొలనులో ఈనెల 25వ తేదీ ఆదివారం జిల్లా సీనియర్‌ స్విమ్మింగ్‌, వాటర్‌ పోలో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి శనివారం తెలిపారు. స్విమ్మింగ్‌ పోటీలో పాల్గొనే క్రీడాకారులు 2010 సంవత్సరం, అంతకు ముందు జన్మించిన వారై ఉండాలన్నారు. అలాగే వాటర్‌ పోలో పోటీలో పాల్గొనేవారు 2008 సంవత్సరానికి ముందు పుట్టిన వారై ఉండాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు జూన్‌ ఒకటో తేదిన జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. వివరాలకు 8296374963 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.

నరసరావుపేటలో భారీ వర్షం

నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవుతుండగా, అడపా దడపా వర్షాలు కురుస్తుండటం, శుక్రవారం మెండుగా వర్షం పడటంతో మరో రెండురోజులు చల్లగా ఉండే అవకాశం ఉంది. ఈ వర్షానికి ఎక్కడా ఆర్థిక, ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement