నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌

May 12 2025 1:01 AM | Updated on May 12 2025 1:01 AM

నేడు

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌

నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) మాచర్ల పట్టణంలో సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 గంటలకు నెహ్రూనగర్‌లోని వీవీఎన్‌ గార్డెన్స్‌లో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా నియోజకవర్గాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఇలా నిర్వహించామని తెలిపారు.

నరసరావుపేటలో పోలీస్‌ తనిఖీలు

నరసరావుపేటటౌన్‌: పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, మాల్స్‌లో డాగ్‌ స్కాడ్‌తో తనికీలు నిర్వహించారు. వీటితో పాటు రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వన్‌టౌన్‌ సీఐ ఎం. విజయ్‌చరణ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వంశీకృష్ణ, అరుణ సిబ్బందితో రైల్వేస్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. క్యాంటీన్‌లో డాగ్‌ స్కాడ్‌తో కలిసి తనిఖీలు చేపట్టారు.

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌ను ఆదివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. కొద్దిసేపు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శాంతిభద్రతలపై చర్చించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.

పవర్‌ లిఫ్టింగ్‌లోషబీనాకు 4 స్వర్ణాలు

మంగళగిరి: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న ఏషియన్‌ జూనియర్‌ ఎక్యూప్డ్‌ ఉమెన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో దేశం తరఫున పాల్గొన్న షేక్‌ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్‌ సంధానిలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్‌ 190 కేజీలు, బెంచ్‌ ప్రెస్‌ 85 కేజీలు, డెడ్‌ లిఫ్ట్‌ 180 కేజీలు, ఓవరాల్‌ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ షేక్‌ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు

పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పంచామృత స్నపన, తిరుమంజనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భావనారాయణ స్వామి అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం

తాడేపల్లి రూరల్‌: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌ 
1
1/3

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌ 
2
2/3

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌ 
3
3/3

నేడు మాచర్లలో పీజీఆర్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement