చిరస్మరణీయుడు డాక్టర్‌ పట్టాభి | - | Sakshi
Sakshi News home page

చిరస్మరణీయుడు డాక్టర్‌ పట్టాభి

May 9 2025 1:20 AM | Updated on May 9 2025 1:20 AM

చిరస్మరణీయుడు డాక్టర్‌ పట్టాభి

చిరస్మరణీయుడు డాక్టర్‌ పట్టాభి

కొరిటెపాడు(గుంటూరు): స్వాతంత్ర సమరయోధునిగా, గాంధీజీ అనుంగు శిష్యుడిగా, స్వాతంత్య్రానికి పూర్వమే ఆంధ్రాబ్యాంక్‌తో పాటు అనేక ఆర్థిక, బీమా సంస్థలను స్థాపించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య బ్యాంకు ఉద్యోగులతో పాటు తెలుగు వారందరికీ చిరస్మరణీయులని యూనియన్‌ బ్యాంక్‌ రీజియన్‌ హెడ్‌ సయ్యద్‌ జవహర్‌ పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ గుంటూరు, నరసరావుపేట రీజియన్‌ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కాలేజీ యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన పట్టాభి కాంస్య విగ్రహాన్ని గురువారం రీజియన్‌ హెడ్‌ జవహర్‌తో పాటు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ విశ్రాంత అధికారులు, యూనియన్‌ నాయకులు ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి డాక్టర్‌ భోగరాజు అమర్‌ రహే.. లాంగ్‌ లివ్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో జవహర్‌ మాట్లాడారు. డాక్టర్‌ భోగరాజు స్ఫూర్తితో రిటైరీస్‌, మహిళలు, విద్యార్థుల కోసం కొత్త పథకకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎ.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంక్‌ రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రోగ్రాం కమిటీ చైర్మన్‌ కె. హరిబాబు మాట్లాడుతూ అసోసియేషన్‌ రిటైరీస్‌ సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ రిటైరీస్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ కృష్ణమూర్తి వి. వారణాసి మాట్లాడుతూ పారిశ్రామిక, రాజకీయ ఉద్దండులు ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌, రాజగోపాల్‌ నాయుడు వంటి వారు పారిశ్రామికవేత్తలగా ఎదిగేందుకు సీతారామయ్య సహకరించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 11,500 మంది విశ్రాంత ఆంధ్రా బ్యాంక్‌ ఉద్యోగులు కుటుంబాల కంటే సమాజ, దేశ సేవకు తొలి ప్రాధాన్యతనిస్తారని వివరించారు. ఈ సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. యూనియన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ పి.శ్రీనివాస్‌, విజయ బ్యాంక్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ బి.ఎస్‌. రామారావు, ఆంధ్రప్రదేశ్‌ బ్యాంక్‌ రిటైరీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు బీబీవీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏబీఆర్‌ఈఏ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.గణేష్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వై.కోటేశ్వరరావు, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రెటరీ వై.హనుమంతరావు, నిరంజన్‌ కుమార్‌, సుబ్బారావు, శివాజీ, ప్రసన్నత బాబు, కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.

ఇండియన్‌ బ్యాంక్‌ రీజియన్‌

హెడ్‌ ఎస్‌. జవహర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement