
బైక్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు
బల్లికురవ: వేగంగా వస్తున్న కారు.. బైక్ను ఢీకొట్టడంతో ఇరువురు యువకులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం నార్కెట్పల్లి–మేదరమెట్ల నామ్ రహదారిపై మండలంలోని వి. కొప్పరపాడు శివాలయం సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన అయ్యప్ప, వీరగంగయ్య పని నిమిత్తం బల్లికురవ మండలంలోని సూరేపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో తీవ్ర గాయాలపాలైన ఇరువురికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తలించారు. స్థానికులు కారును అదుపులోకి తీసుకున్నారు.