
ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు
ఇంకొల్లు (చినగంజాం): మండలంలోని పావులూరు గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గాదె వీరారెడ్డి మెమోరియల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం పోటాపోటీగా జరిగాయి. పావులూరు రెడ్డి యూత్ నిర్ణీత 10 ఓవర్లలో 83 పరుగులు చేయగా బీసీ యూత్ ఐదు ఓవర్లలో 84 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. రెండో మ్యాచ్ పావులూరు వెంకటేష్ ఫ్రెండ్స్, దగ్గుబాడు ఫ్రెండ్స్ యూత్ జట్ల మధ్య నిర్వహించగా పావులూరు వెంకటేష్ ఫ్రెండ్స్ జట్టు విజయం సాధించింది. బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, కార్యదర్శి పులఖండం రామకృష్ణా రెడ్డి, తలకాయల కోటి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.