
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
నరసరావుపేట: విప్లవ వీరుడు, మన్యం ప్రజల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ప్రతిఒక్కరూ గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్వారి దోపిడీని ఎదుర్కోవడానికి మన్యం ప్రజలకు, పేదవారికి అండగా నిలిచిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎస్బీ సీఐ బండారు సురేష్బాబు, ఆర్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో...
కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ ఏకా మురళి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏఓ, అధికారులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు