వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి

May 8 2025 7:59 AM | Updated on May 8 2025 7:59 AM

వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి

వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై టీడీపీ నేతల దాడి

వెల్దుర్తి: బోదిలవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు అత్తులూరి హనుమంతరావుపై అదే గ్రామానికి చెందిన పాపయ్య, రాజేష్‌ లు దాడి చేసి గాయపరిచారు. హనుమంతరా వు పొలానికి వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంలో బస్టాండ్‌ సెంటర్‌లో టీడీపీ కార్యకర్తలు ఆయనపై రాళ్లు, కర్రలతో దాడి చేయటంతో గాయాలపాలయ్యా డు. బంధువులు హనుమంతరావును మాచర్ల వైద్యశాలకు తరలించారు. అనంతరం నర్సరావుపేట తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

క్షేత్ర సహాయకుల తొలగింపు

నరసరావుపేట: వివిధ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న తొమ్మిదిమంది క్షేత్ర సహాయకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ సిద్దలింగమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పత్రికలకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వర్క్‌సైట్‌లో ఒక వర్క్‌ ఐడీకి సంబంధించిన ఒకటే ఫొటోను వివిధ వర్క్‌ ఐడీలకు పంపినట్లుగా రుజువైందన్నారు. మాదుగుల పంచాయతీలోని ఎల్‌.అలేఖ, బెల్లంకొండ: కె.వెంకటేష్‌, కొప్పునూరు: కె.మరియదాసు, ఇర్లపాడు: బి.వీరాంజనేయులు, శావల్యాపురం: సీహెచ్‌.బాలకృష్ణ, వెల్లటూరు: ఏ.ప్రియాంక, రేమిడిచర్ల: టి.మనెయ్య, పిట్టంబండ: వై.మమత, దొండపాడు పంచాయతీలోని ఎం.అనూషలను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ నోటీసు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement