
జూలకల్లు గ్రామంలో కార్డన్ సెర్చ్
పిడుగురాళ్లరూరల్: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని జూలకల్లు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించామని గురజాల ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు చెప్పారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల వరకు జూలకల్లు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 11 కత్తులు, నాలుగు గడ్డపారలు, గొడ్డళ్లు, కొడవళ్లతోపాటు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ జూలకల్లు గ్రామంలో ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని, ముందస్తు చర్యలలో భాగంగానే ఈ గ్రామంలో ప్రతి ఇంటిలోనూ సోదాలు నిర్వహించామని తెలిపారు. ఇరుపార్టీల వారికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, దాచేపల్లి సీఐ భాస్కర్రావు, గురజాల, సత్తెనపల్లి, గురజాల సబ్ డివిజన్పరిధిలోని ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు.
కొడవళ్లు, గడ్డపారలు,
30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం