
వేసవి శిక్షణ కేంద్రాల కోలాహలం
సత్తెనపల్లి: వేసవి వచ్చిందంటే పిల్లలతో మైదానాలు నిండిపోతాయి. వివిధ రకాల క్రీడలను కోచ్లు ఉచితంగా నేర్పిస్తుండడంతో పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ వేసవి శిబిరాల్లో చేరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు మైదానాల్లో శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం, సాయంత్రాలు వేసవి శిబిరాలకు పంపి వారిలో క్రీడానైపుణ్యాలు పెంచుతున్నారు. కోచ్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పిల్లలకు ఆటల్లో మెలకువలు నేర్పుతున్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 17 క్రీడాంశాల్లో 50 శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోచ్లు కోరుతున్నారు.
జిల్లాలో 17 క్రీడాంశాల్లో 50 శిక్షణ శిబిరాలు
విద్యార్థులు క్రీడాకారులుగా రాణించాలి
జిల్లాలోని విద్యార్థులు మంచి క్రీడాకారులుగా రాణించటానికి వేసవి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. క్రీడల్లో మెలకువలను తెలుసుకొని ఆ మేరకు సాధన చేస్తే తప్పకుండా విజేతలుగా నిలుస్తారు. నెల రోజులు పాటు జరిగే వేసవి శిక్షణ శిబిరాలను ఎక్కువమంది వినియోగించుకునేలా క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలి.
–పి.నరసింహారెడ్డి, డీఎస్డీఓ, పల్నాడు

వేసవి శిక్షణ కేంద్రాల కోలాహలం