
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 291 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్తో పాటు జేసీ గనోరే సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత అర్జీలను స్వీకరించారు.
కలెక్టర్ పి.అరుణ్బాబు పీజీఆర్ఎస్లో 291 అర్జీలు స్వీకరణ