
కిశోరి వికాసం
బాలికల భవితకు
నరసరావుపేట: బాలికలు, యువతుల ఉజ్వల భవిష్యత్కు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. కౌమార బాలికల సాధికారిత లక్ష్యంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కిశోరి వికాసం వాల్పోస్టర్ను కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. యుక్తవయస్సు బాలికలకు ఈనెల 2వ తేదీ నుంచి జూన్ 10 వరకు వివిధ శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఈ ప్రత్యేక సమ్మర్ క్యాంపెయిన్ను రూపొందించడం జరిగిందన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ నియంత్రణలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేయాలన్నారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలను ఈ–సాధన పోర్టల్లో అప్లోడ్ చేయాలని, ఈ వేసవి కార్యక్రమం మొత్తం విజ్ఞానవంతంగా, ఆనందోత్సాహంగా ఉండాలని, దీనిలో కిశోర బాలికలు పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 513.90 అడుగుల వద్ద ఉంది. ఇది 138.3868 టీఎంసీలకు సమానం.
పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

కిశోరి వికాసం