
హిందూ ధర్మం గురించి తెలియజేయాలి
అమర్తలూరు(వేమూరు): సాహిత్య ప్రాజెక్టు హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలియజేయాలని దాస సాహిత్య ప్రాజెక్టు అధ్యక్షులు శ్రీమాన్ గడ్డిపాటి శ్రీనివాసరావు అన్నారు. అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలో ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు హిందూ ధర్మ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన గరువుపాలెంలో హనుమాన్ శోభాయాత్ర, సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 22వ తేదీన ప్రతి గ్రామంలో దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించాలని తెలిపారు. హనుమంతును స్ఫూర్తిగా తీసుకొని ధర్మ రక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, పొన్నపల్లి సత్యనారాయణ, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, తమ్మన సాంబశివరావు, రామిశెట్టి నరసింహారావు, దాస సాహిత్య భజన మండల సభ్యులు పాల్గొన్నారు.
బేసిక్ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి
రేపల్లె: బేసిక్ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ సోషలిజం కోరారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి విధానాన్ని అన్ని పాఠశాలలో ఒకే విధంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పాఠశాలల పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏపీటీఎఫ్ దశల వారి ఉద్యమాలకు ప్రణాళిక రచించిందని అన్నారు. సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, 12వ పీఆర్సీని ప్రకటించి పెండింగ్లో ఉన్న ఐఆర్, డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు రాజారత్నం, వై.ఆంజనేయ ప్రసాద్, తేలప్రోలు శ్రీనివాసరావు, వై. చెన్నకేశవులు, సీహెచ్.శ్రీనివాస్, ఎం.రాంబాబు. పి.లక్ష్మీనారాయణ, కుర్రా కిరణ్, డి మల్లికార్జునరావు, సత్యనారాయణ, యాకోబు తదితరులు పాల్గొన్నారు.

హిందూ ధర్మం గురించి తెలియజేయాలి