
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి
పార్టీ నాయకులతో ప్రకాశం జిల్లా పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
యర్రంవారిపాలెం (కారంచేడు): రాబోయే రోజుల్లో పర్చూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేలా చేసి, పార్టీ బలోపేతానికి నాయకులంతా సమన్వయంగా పనిచేయాలని ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం యర్రంవారిపాలెంలోని ఆయన స్వగృహంలో నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రధానంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉండేలా నాయకులు కృషి చేయాలన్నారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా కష్టపడి పనిచేస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మనందరి లక్ష్యంగా కృషి చేయాలన్నారు. పేదల పక్షాన ప్రభుత్వంతో పోరాడాల్సి ఉందన్నా రు. ప్రజలకు కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ అమలు జాడ కనిపించడం లేదన్నా రు. హామీల్లో ఒక్కదానిని కూడా అమలు చేయకుండాలనే లక్ష కోట్ల అప్పులు చేశారని అన్నారు.
బత్తులను సత్కరించిన నాయకులు
పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకునిగా నియామకం పొంది మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన బత్తుల బ్రహ్మానందరెడ్డిని పర్చూరు నియోజకవర్గ వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్కరించి, అభినందనలు తెలిపారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ, ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కారంచేడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు యార్లగడ్డ సుబ్బారావు, మాజీ ఉపాధ్యక్షుడు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు మండల కన్వీనర్ కఠారి అప్పారావు, బాపట్ల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోట శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు మలినేడి జగన్నాథం, లంకా శివ, పంగులూరి నాగేశ్వరరావు, మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ యాద్దనపూడి హరిప్రసాద్, వేణుగోపాలస్వామి దేవస్థాన చైర్మన్ రావువారి ప్రసాద్, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భవనం రాజగోపాలరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.