7న శంకర్‌విలాస్‌ ఆర్‌ఓబీ పనులకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

7న శంకర్‌విలాస్‌ ఆర్‌ఓబీ పనులకు శంకుస్థాపన

May 4 2025 6:53 AM | Updated on May 5 2025 10:28 AM

నెహ్రూనగర్‌: ఈ నెల 7వ తేదీన శంకర్‌ విలాస్‌ ఆర్‌ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన జరుగుతుందని, విస్తరణ పెండింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో కలిసి శంకర్‌ విలాస్‌ ఆర్‌ఓబీ రోడ్డు విస్తరణ పనులను కమిషనర్‌ పరిశీలించారు. తొలుత ఆర్‌ఓబీ నిర్మాణ డిజైన్‌ను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన విస్తరణ పనులు, మార్కింగ్‌ అంశాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఆర్‌ఓబీ నిర్మాణ పనుల శంకుస్థాపన చేస్తారన్నారు. శంకుస్థాపన జరిగే ప్రదేశం నిర్ణయం అనంతరం శిలాఫలకం ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ అధికారుల సమన్వయంతో చేయాలన్నారు. ఎస్‌ఈ నాగ మల్లేశ్వరరావు, సిటీ ప్లానర్‌ రాంబాబు, డీసీపీ సూరజ్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ డీఈఈ చిన్నయ్య, ఏఈఈ సంజీవ కుమార్‌, ఏసీపీలు, పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

మల్లేశ్వరస్వామి సేవలో

అదనపు కమిషనర్‌

పెదకాకాని: రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనరు తెనాలి చంద్రకుమార్‌ దంపతులు శనివారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్‌, ఆలయ అర్చకస్వాములు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాలతో అదనపు కమిషనరు దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణలు చేసిన వారు భ్రమరాంబమల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అదనపు కమిషనరు దంపతులకు ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు వేద ఆశ్వీరవచనం చేశారు. తెనాలి చంద్రకుమార్‌ దంపతులను ఆలయ ఉప కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

వైభవంగా పునఃప్రతిష్టా మహోత్సవాలు

దుగ్గిరాల: దుగ్గిరాల మండలంలోని కేఆర్‌ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో పునఃప్రతిష్టా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు నిత్యపూజావిధులు, వాస్తుపూజ, బలిపర్యగ్నీకరణ విధులు, ప్రభాతబలి, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, జలాధివాసం, క్షీరాధివాసం, అదివాసహోమాలు జరిగాయి. భక్తులు బిందెలతో నీటిని తెచ్చి స్వయంగా విగ్రహాలకు అభిషేకం చేశారు. దేవస్థాన ఈఓ కె.సునీల్‌ కుమార్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

‘నీట్‌’ ఏర్పాట్లు పరిశీలన

గుంటూరు ఎడ్యుకేషన్‌: నీట్‌ పరీక్ష కేంద్రాలను శనివారం డీఆర్‌ఓ ఎన్‌ఎస్‌ ఖాజావలి, డీఈఓ సీవీ రేణుక పరిశీలించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన వారు విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చీఫ్‌ సూపరింటెండెంట్‌తో చర్చించారు. హెచ్‌ఎం షేక్‌ ఎండీ ఖాసిం ఉన్నారు.

7న శంకర్‌విలాస్‌ ఆర్‌ఓబీ పనులకు శంకుస్థాపన 
1
1/2

7న శంకర్‌విలాస్‌ ఆర్‌ఓబీ పనులకు శంకుస్థాపన

7న శంకర్‌విలాస్‌ ఆర్‌ఓబీ పనులకు శంకుస్థాపన 
2
2/2

7న శంకర్‌విలాస్‌ ఆర్‌ఓబీ పనులకు శంకుస్థాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement