
నేడు రేపల్లె ప్యాసింజర్ రైళ్లు రద్దు
తెనాలిరూరల్: తెనాలి పట్టణంలోని మారీస్పేట మొండిగోడల వద్ద పినపాడు కాల్వపై వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో తెనాలి– రేపల్లె మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను ఆదివారం రద్దు చేసినట్టు తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్ టీవీ రమణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు–రేపల్లె (67249), రేపల్లె–గుంటూరు(67250), గుంటూరు–రేపల్లె(67223), రేపల్లె–గుంటూరు(67224), తెనాలి–రేపల్లె(67231), రేపల్లె–తెనాలి(67232), తెనాలి–రేపల్లె(67233), రేపల్లె–తెనాలి(67234) రైళ్లను రద్దు చేసినట్టు చెప్పారు. విజయవాడ–తెనాలి(67221) రైలును గుంటూరుకు మళ్లిస్తారని, సికింద్రాబాద్ నుంచి రేపల్లె(17645) వెళ్లే ప్యాసింజర్ రైలు గంట ఆలస్యంగా నడుస్తుందని తెలిపారు.