
ప్రధాని మోదీ సభకు 11 బస్సులు
కారంచేడు: అమరావతి పునఃప్రారంభోత్స కార్యక్రమానికి ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం 11 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సుల ద్వారా 480 మందిని సభకు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం ఈ బస్సులను మండల ప్రత్యేక అధికారి, బాపట్ల జిల్లా సహకార శాఖ అధికారి సీహెచ్ శ్యాంసన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి బస్సుకు ఇన్చార్జ్లను నియమించారు. బస్సుల్లో ఏఎన్ఎంలు, ఆశలు, మహిళా పోలీసులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ జి.నాగరాజు, ఎంపీడీఓ కె.నేతాజీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.