
మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి హౌస్ అరెస్ట్
లక్ష్మీపురం: ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునఃప్రారంభానికి విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు షేక్ మస్తాన్ వలిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ స్పందించలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో అమరావతికి వచ్చిన సమయంలో ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, పాచి పోయిన లడ్డు, చెంబులో నీరు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సారి వచ్చి అందరిని యోగా చేయాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌస్ అరెస్ట్లు సరి కాదని తెలిపారు.