
ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి అనుమతులు
నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రంలో స్థానిక రవాణా శాఖ ఆర్టీవో కార్యాలయం పక్కనే ఏర్పాటుచేసిన ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో జిల్లా రవాణా శాఖ అధికారి సంజయకుమార్ అనుమతులు మంజూరు చేశారని ఆ శిక్షణ సంస్థ మేనేజింగ్ పార్టనర్ కనకదుర్గ పద్మజ వెల్లడించారు. అనుమతి పత్రాన్ని మంగళవారం జిల్లా రవాణా శాఖ అధికారి జి.సంజీవ్కుమార్, ఎంవీఐ శివనాగేశ్వరరావు, వంశీల చేతుల మీదుగా తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ వెనుకబడిన పల్నాడు జిల్లా ప్రాంతంలో యువతకు స్వయం ఉపాధి కోసం కారు, హైడ్రాలిక్తో కూడిన ట్రక్ డ్రైవింగ్ (ట్రాన్స్పోర్టు వాహనం) శిక్షణ, లైసెన్స్, ఉపాధి ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చదువులేని యువతకు ఉపాధి కొరకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పిస్తామని, అదేవిధంగా రోడ్డుసేఫ్టీ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని తెలిపారు.
స్వీకరించిన రోడ్డు సేఫ్టీ ప్రతినిధులు