
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, నరసరావుపేట: పొగాకు రైతులు ఈ ఏడాది తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వైట్, బ్లాక్ రెండు రకాల బర్లీ సాగు చేస్తారు. అయితే రెండు రకాల రైతులు నష్టాల్లో ఉన్నారు. పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి నెలకొంది. గతేడాది పొగాకు జిల్లావ్యాప్తంగా సుమారు 1500 ఎకరాల్లో సాగు చేశారు. వారికి ఎకరానికి సుమారు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర దాకా లాభం వచ్చింది. దీంతో ఈ ఏడాది సాగు మూడింతలు పెరిగింది. సుమారు 5 వేల ఎకరాల్లో పంట సాగుచేసిన రైతులకు ప్రస్తుతం కొంతమంది ఆకు తీసిన కూలీల డబ్బు కూడా రాని పరిస్థితి నెలకొని ఉండటంతో చాలా మంది రైతులు కోయకుండా ఆపేస్తున్నారు. పొగాకు కొంటామని చెప్పిన బహుళజాతి సంస్థలు ఈ ఏడాది పొగాకు కొనడానికి ముందుకు రాకపోవడంతో వ్యాపారులు చెప్పిందే వేదమయ్యింది. గతేడాది రూ.12 వేలకు పైగా పలికిన నల్ల బర్లీకి ఈ ఏడాది కనీసం రూ.4 వేలు ఇవ్వమన్నా ఇవ్వకుండా వ్యాపారులు బెట్టుచేస్తున్నారు.
తగ్గిన దిగుబడి, ధర...
పొగాకు రైతుకు ఈ ఏడాది రెండు రకాలుగా దెబ్బ తగిలింది. ఒక వైపు దిగుబడి తగ్గడంతో పాటు మరోవైపు భారీగా ధర తగ్గడంతో రైతు తీవ్ర నష్టాల్లో ఉన్నాడు. క్వింటా ఆకు గుచ్చేందుకు 10 మంది కూలీలు అవసరం, ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.800 వేతనం చెల్లించాలి. నారు, సాగుకు కలిపి రూ.9 వేలు ఖర్చులు ఉండగా, కూలీలు, ఇతరత్ర పై ఖర్చులకు రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు పెట్టాల్సి వస్తుంది. కౌలు డబ్బులు అదనం. వెరసి ఎకరాకు రూ.లక్షన్నర దాకా పెట్టుబడి అవుతుంది.
అచ్చంపేటలో సాగు చేసిన పొగాకు పంట
న్యూస్రీల్
గతేడాది క్వింటా రూ.13 వేలు నుంచి రూ.15 వేలు పలకడంతో భారీ లాభాలు ఈ ఏడాది సాధారణ విస్తీర్ణానికి మించి సాగుచేసిన పల్నాడు రైతులు పంట చేతికందేసరికి దారుణంగా పడిపోయిన ధర తీవ్ర నష్టాల్లో పొగాకు రైతులు క్వింటాకు కనీసం రూ.4 వేలు కూడా దక్కని పరిస్థితి కంపెనీలు కొనలేమని చెప్పడంతో తేమశాతం పేరుతో దోచుకుంటున్న వ్యాపారులు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025