
గణనీయంగా పెరిగిన సాగు
గతేడాది ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు వచ్చింది. రూ.15 నుంచి రూ.18 వేల వరకు ధర పలికి రైతులకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర మిగిలిన రైతులు ఉన్నారు. వారిని చూసే ఈఏడాది పొగాకు అధికంగా సాగు చేశారు. ఈ ఏడాది ఎకరాకు 14 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. ఈ ఏడాది నంబర్ వన్ క్వాలీటీ రూ.10 నుంచి 12వేలు ఇస్తున్నారు. గతేడాది పనికిరాని సూరసైతం (గుల్లాకు) కూడా రూ.4వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది మంచి ఆకు కూడా ఆ ధరకు కొనుగోలు చేయక పోవడం దారుణం. ప్రభుత్వం ఇప్పటికై నా పొగాకు రైతుల పరిస్థితిని గమనించి క్వింటాకు రూ.15 వేలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.