
న్యాయస్థాన భవనాలను సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్త
నరసరావుపేటటౌన్: న్యాయస్థాన భవనాలను గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ చక్రవర్తి శనివారం సందర్శించారు. ఆయన కోర్టు సముదాయంలో గల భవనాలను ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు తక్షణమే చేయాలని వారికి సూచించారు. న్యాయవాద సంఘ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న న్యాయవాదులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయనను స్థానిక 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ, న్యాయమూర్తులు కె.మధుస్వామి, ఎం.గాయత్రిలు ఆహ్వానం పలికారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు.