మోసం చేయడం చంద్రబాబు నైజం | - | Sakshi
Sakshi News home page

మోసం చేయడం చంద్రబాబు నైజం

Jun 2 2025 2:03 AM | Updated on Jun 2 2025 2:03 AM

మోసం చేయడం చంద్రబాబు నైజం

మోసం చేయడం చంద్రబాబు నైజం

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

గురజాల: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబునాయుడు నైజం అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని, ఇందుకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూన్‌ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలుపొందిన రెండు నెలల్లోనే బ్రాహ్మణపల్లి సమీపంలో మెడికల్‌ కళాశాలను స్థాపించామని తెలిపారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు నిధులు తీసుకువచ్చి 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. గురజాల నియోజకవర్గాన్ని రూ.3500 కోట్లతో అభివృద్ధి చేశామని, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏం అభివృద్ది చేశారో చెప్పాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా కూటమి నేతలు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించి జానపాడు రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టేలా చూశామని చెప్పారు. మెడికల్‌ కళాశాల కూడా ప్రారంభించేలా చూస్తామన్నారు. అనంతరం వెన్నుపోటు దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), మండల కన్వీనర్‌ కొమ్మినేని బుజ్జి, మాజీ కన్వీనర్‌ సిద్దాడపు గాంధీ, పట్టణ కన్వీనర్‌ కె. అన్నారావు, కర్రా చిన్న కోటేశ్వరరావు, వేముల చలమయ్య, కావూరి అంజిబాబు, మహంకాళి యశోద దుర్గ, చల్లా కాశీబాబు, జక్కా సత్యం, షేక్‌ నాసర్‌ౖ సెదా, బండ్ల వెంకయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement