ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025
చేప పిల్లలు విడుదల
విజయపురిసౌత్: అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి మత్యశాఖ అధికారులు 10 లక్షల చేప పిల్లలను శనివారం విడుదల చేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.70 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది.
నృసింహుని సేవలో..
మంగళగిరి టౌన్: మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు మోహనకృష్ణ శనివారం స్థానిక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో
ప్రత్యేక పూజలు చేశారు.
ఒక్కసారి సున్నా చూసుకోండి అని చెబుతూనే వాహనదారులను బంకు నిర్వాహకులు నిండా ముంచుతున్నారు. డబ్బు ఇవ్వడానికి కాస్త చూపు పక్కకు తిిప్పితే చాలు చిటికెలోనే పంప్ రీడింగ్లో చక్రం తిప్పేస్తున్నారు. రాత్రి వేళ చిప్ మార్చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. బంకులోకి అడుగుపెట్టిన వారికి గొంతు తడుపుకొందామన్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. అసలు బంకుల్లో కనీస వసతుల సంగతి దేవుడెరుగు.. ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదు. వినియోగదారులకు నిర్ణీత కొలత, నాణ్యత విషయంలో గ్యారంటీ లేకుండాపోయింది.
ఇఫ్తార్ సహర్
(ఆది) (సోమ)
నరసరావుపేట 6.26 4.55
గుంటూరు 6.24 4.53
బాపట్ల 6.24 4.53
నరసరావుపేట టౌన్: ఉరుకులు పరుగుల జీవితంలో మనిషికి వాహనం తప్పనిసరి. కాలు బయటకు పెట్టాలంటే స్టార్ట్ అనాల్సిందే. అలాంటి తరుణంలో వాహనాలకు ఇంధనం నింపుకొనే విషయంలో వాహనదారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించడం లేదు. పెట్రోలు బంకులోకి వెళితే లైనులో నిలుచున్నామా.. పెట్రోల్ కొట్టించామా.. తిరిగి వచ్చామా అనే లెక్కలో ఉన్నారు. కానీ బంకుల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యజమానులపై ఉందని గుర్తించడం లేదు. వాహనాలకు అవసరమైన గాలి ఫిల్లింగ్ అక్కడే చేయించుకోవచ్చని తెలుసుకోవడం లేదు. అవసరమైతే క్వాలిటీ, క్వాంటిటీ చెకింగ్ చేయొచ్చనే విషయంపై దృష్టి సారించడం లేదు. ఇదే అదనుగా పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
ఇవి మీ కోసమే..
ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారులకు ఉచితంగా తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స కిట్, గాలి నింపే సౌకర్యం ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. కంపెనీ డీలర్, సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలి. పెట్రోల్, డీజిల్ ధర, ట్యాంక్లో ఉన్న నిల్వల వివరాలు, 24 గంటలు నీటి సౌకర్యం కలిగి ఉండాలి. ఈ–సేవలను అందించాలి. శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండాలి. అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా ఉపకరణాలు ఏర్పాటు చేయాలి. పెట్రోల్ బంకులో ‘నో స్మోకింగ్’, ఇతర భద్రతా సూచనలు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. సరైన కొలతలతో పెట్రోల్, డీజిల్ విక్రయించాలి. వినియోగదారుడు అడిగితే పెట్రోల్ నాణ్యతను చూపించాలి. వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.
ప్రభుత్వ బంకులోనే వసతులు శూన్యం
రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులోనే కనీస సౌకర్యాలు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ‘సాక్షి’ సదరు పెట్రోల్ బంకును పరిశీలించగా... గాలి నింపే పరికరం నిరుపయోగంగా దర్శనమిచ్చింది. కొన్ని నెలలుగా ఇది పనిచేయటం లేదు. మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నా అవి కేవలం సిబ్బందికి మాత్రమేనని చెప్పారు. వాహనదారులు వినియోగించాటానికి వీలులేదని సిబ్బంది దురుసుగా సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటు బంకుల్లో మరింత దారుణంగా ఉంది. ఎక్కడా మరుగుదొడ్లు లేవు. తాగునీటి వసతి ఉండటం లేదు. కొంతమంది సిబ్బంది పెట్రోల్ నింపే సమయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతల శాఖ పట్టించుకోవడం లేదు.
7
న్యూస్రీల్
రాత్రి వేళ మోసం చేస్తున్నారు
ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు
సున్నా రీడింగ్ అంటూనే
నిలువునా మోసం
ఇంధనం కొలతల్లో సిబ్బంది
చేతివాటం
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
తాగునీరు, మరుగుదొడ్లు
వంటి సౌకర్యాలు కరవు
గాలి నింపే పరికరాలూ
అంతంత మాత్రమే
తీవ్రంగా నష్టపోతున్న
వినియోగదారులు
చర్యలు తీసుకోవడంలో
అధికారులు విఫలం
పట్టణ శివారులో ఉన్న పెట్రోల్ బంకుల్లో రాత్రివేళ ఇచ్చిన డబ్బులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నింపటం లేదు. అక్కడ పనిచేసే సిబ్బంది సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్ నాణ్యత చూపించే పరికరం బంకుల్లో అందుబాటులో ఉండటం లేదు. ఏ బంకుల్లో కూడా ఉచితంగా గాలి నింపడం లేదు. మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులో లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా యజమానులు ఇచ్చే మాముళ్లో.. లేక ఏ ఇతర కారణమో తెలియదుగానీ చర్యలు మాత్రం తీసుకోవటం లేదు.
– కుంచాల స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు,
వినియోగదారుల సంఘం
పల్నాడు జిల్లాలో మొత్తం 210 పెట్రోలు బంకులు ఉన్నాయి. ఏటా వాటిని పరిశీలించి స్టాంపింగ్ వేస్తున్నాం. దీంతోపాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ ఏడాది 36 కేసులు నమోదు చేశాం. రూ.2.70 లక్షల జరిమానా విధించాం. బంకుల యజమానులు విధిగా నిబంధనలు పాటించాలి. వాహనదారులు పెట్రోల్ కల్తీ, పరిమాణంపై అనుమానం ఉండి అడిగితే క్వాలిటీ టెస్ట్ చేసి చూపించాల్సిన బాధ్యత యజమానులదే. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టోల్ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– నల్లబోతుల అల్లూరయ్య,
అసిస్టెంట్ కంట్రోలర్, పల్నాడు జిల్లా
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు