నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు కల్తీకి గురవుతున్నాయి. వాటిని అరికట్టి వినియోగదారుల సంక్షేమానికి ప్రభుత్వం అమల్లో ఉంచిన చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమౌతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు, మామూళ్ల మత్తులో అధికారులు ఉండటంతో కల్తీ వస్తువులను కొనుగోలుచేసే వినియోగదారుడు నష్టపోవటమే గాకుండా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఽఅధికారుల నిఘా, తనిఖీలు నామమాత్రంగానే జరుగుతుండటంతో నాసిరకం వ్యాపారం దర్జాగా జరుగుతోంది. కల్తీలు జరుగుతున్నట్లు వినియోగ సంఘాల దృష్టికి వస్తున్నా ఏమి చేయలేని పరిస్థితులో ఉంటున్నాం.
–కుంచాల స్వామి, పట్టణ వినియోగదారుల
సంఘ ఉపాధ్యక్షులు