పెదకూరపాడు: హోలీ పర్వదినం ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. స్నేహితులతో హోలీ జరుపుకుని రంగులను కడుకునేందుకు వాగులోకి దిగిన 12 సంవత్సరాల బాలుడు మృత్యు ఒడిలోకి చేరాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులను రైతులు కాపాడంతో ప్రాణాపాయం తప్పింది.కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బుస్సాపురం గ్రామానికి చెందిన పాటిబండ్ల మహేందర్ అలియాస్ చిన్నా(12) పాటిబండ్లలోని ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండుగ కావడంతో పాఠశాలకు సెలవు ఇచ్చారు. ముగ్గురు స్నేహితులు పాటిబండ్ల అభినయ్, కూచిపూడి రాహోల్ విక్రమ్, అంకాల సాద్విక్తో కలిసి మధ్యాహ్నం వరకు మహేందర్ రంగులు పూసుకుని సరదాగా గడిపాడు. తర్వాత రంగులు కడుక్కునేందుకు కొండ కింద ఉన్న చిన్నవాగులోకి దిగారు. నలుగురు సరదాగా ఈత కొట్టారు. ప్రమాదవశాత్తు పాటిబండ్ల మహేందర్ వాగులోకి పూడికతో కూరుకుపోయాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు వాగు పక్కన ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని ఉండిపోయారు. మహేందర్ కూరుకుపోవడంతో మిగిలిన వారు బిగ్గరగా కేకలు వేశారు. అక్కడే వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు వచ్చి ముగ్గురుని కాపాడారు. వాగు అడుగు భాగంలో కూరుకుపోయిన మహేందర్ను బయటకు తీసి పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
తీవ్ర ప్రయత్నం చేసిన వైద్యులు
మహేందర్ను కాపాడేందుకు పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భరత్ సిబ్బందితో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. గంట పాటు సీపీఆర్ను చేసి కాపాడేందుకు కృషి చేశారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
నా చిన్నాను కాపాడండి
మహేందర్ వాగులో పడిన విషయం తెసుకున్న తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నిర్మలలు హడావుడిగా వ్యవసాయ పనులు మానుకుని వచ్చారు. తల్లి నిర్మల ‘‘నా చిన్నాను కాపాడండి’’ అంటూ వైద్యులను వేడుకున్న తీరు కన్నీరు తెప్పించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విగతజీవిగా ఉండటం చూసి గుండెలవిసేలా తల్లిదండ్రులు విలపించారు. వారికి మహేందర్తో పాటు కూతురు ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం అమరావతి కమ్యూనిటీ వైద్యశాలకు తలించినట్లు ఎస్ఐ గిరిబాబు తెలిపారు.
హోలీలో విషాదం
12 సంవత్సరాలు చిన్నారి మృతి
రంగులు కడుకునేందుకు
వాగులో దిగిన నలుగురు
ముగ్గురును కాపాడిన రైతులు
బుస్సాపురంలో విషాదం
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
చెదిరిన రంగుల స్వప్నం
చెదిరిన రంగుల స్వప్నం